కాబూల్లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 400 మంది మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిని ఒక అనాగరిక, పిరికిపంద, అమానుషమైన హింసా చర్యగా అభివర్ణించింది. "మార్చి 16 రాత్రి కాబూల్లోని ఒమిద్ ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన అనాగరిక వైమానిక దాడిని భారత్ నిస్సందేహంగా ఖండిస్తుంది. ఇది ఒక పిరికిపంద, అమానుషమైన హింసా చర్య. ఏ విధంగానూ సైనిక లక్ష్యంగా సమర్థించలేని ఒక ఆసుపత్రిలో ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ఇప్పుడు ఈ మారణకాండను ఒక సైనిక చర్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది," అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఆసుపత్రిపై పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడిలో 400 మంది మృతి చెందారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘోర ఘటనలో మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తూ ఉన్నాయి.