సరిహద్దు సమస్యలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా.?

తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారతదేశం, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది

By Medi Samrat  Published on  21 Oct 2024 2:00 PM GMT
సరిహద్దు సమస్యలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా.?

తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారతదేశం, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. రష్యాలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపే అవకాశం ఉంది.

గత కొన్ని వారాలుగా భారతదేశం, చైనా దౌత్య, సైనిక సంధానకర్తలు వివిధ ఫోరమ్‌లలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి ఫలితంగా, భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరింది. అక్టోబరు 22-23 తేదీల్లో కజాన్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశంపై ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది. మే 2020 నుండి సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేలా ఇరు దేశాల అధికారులు చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుత ఒప్పందం డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు సంబంధించినది.

Next Story