భారతీయులకు హెచ్చరిక.. ఆ దేశాలకు వెళ్ళకండి

తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

By Medi Samrat  Published on  12 April 2024 3:00 PM GMT
భారతీయులకు హెచ్చరిక.. ఆ దేశాలకు వెళ్ళకండి

తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు ఆ దేశాలకు వెళ్లకుండా ఉండాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ హెచ్చరికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

రానున్న 48 గంటల్లో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం ఉందని, యూదు దేశం అందుకు సిద్ధమవుతోందని ఒక నివేదిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురించింది. ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని అనుకుంటూ ఉందని ఆ నివేదికలో తెలిపారు. ఇజ్రాయెల్ ఇప్పటికే హమాస్‌తో యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా దాడికి దిగితే ఈ యుద్ధం మరింత దూరం వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి చేసి ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్, ఆరుగురు అధికారులను హతమార్చాయి. సిరియా రాజధానిలోని ఇరాన్ కాన్సులేట్‌ను కూల్చివేసిన ఘటనలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన మహ్మద్ రెజా జహెదీ మరణించారు. డమాస్కస్‌లో జరిగిన సమ్మె, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్ గ్రూపులకు మద్దతిచ్చిన ఇరాన్ సైనిక అధికారులపై ఇజ్రాయెల్ టార్గెట్ పెట్టిందని భావిస్తూ ఉన్నారు. అందుకే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడి చేయాలని భావిస్తూ ఉంది.

Next Story