అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. అమెరికా ఆస్తులపై దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అమెరికాపై ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా దాడి చేస్తే అమెరికా సాయుధ దళాల పూర్తి బలం, శక్తి ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో మీపైకి వస్తుందని అన్నారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ రాత్రిపూట జరిపిన దాడుల్లో అమెరికా పాత్ర లేదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సులభంగా ఒక ఒప్పందాన్ని కుదర్చగలనని, ఈ వివాదాన్ని ముగించగలనని కూడా ట్రంప్ చెప్పారు. అయితే ఆదివారం నాడు ఇరాన్, వాషింగ్టన్ DC మధ్య జరగాల్సిన ఆరో రౌండ్ అణు చర్చలు రద్దయ్యాయి.