అక్క‌డ‌ అంతేనా.. కిడ్నాప్‌లు చేస్తున్న పోలీసులు..!

Four Policemen Booked for Kidnapping. కిడ్నాప్ చేసిన వాళ్లను పట్టుకోవాల్సిన పోలీసులు.. రొటీన్ కు భిన్నంగా ప్రవర్తించారు.

By Medi Samrat  Published on  23 Jan 2022 1:53 PM GMT
అక్క‌డ‌ అంతేనా.. కిడ్నాప్‌లు చేస్తున్న పోలీసులు..!

కిడ్నాప్ చేసిన వాళ్లను పట్టుకోవాల్సిన పోలీసులు.. రొటీన్ కు భిన్నంగా ప్రవర్తించారు. ఏకంగా వారే కిడ్నాపర్లు అయ్యారు. నలుగురు ఇస్లామాబాద్ పోలీసులు ముగ్గురు పౌరులను కిడ్నాప్ చేశారు. వారి నుండి పెద్ద ఎత్తున డబ్బులను తీసుకున్నారని.. దోపిడీ చేసినందుకు కేసు నమోదు చేసినట్లు స్థానిక మీడియా ఆదివారం నివేదించింది. అధికారుల్లో ఒకరిని అరెస్టు చేయగా, మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని డాన్ నివేదించింది. వాహనదారుడి నుంచి లంచం తీసుకున్న మరో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) మహ్మద్ అహ్సన్ యూనస్‌ ఈ ఘటనలపై విచారణకు ఆదేశించారు. కేపీ ఖైబర్ జిల్లాకు చెందిన ఇర్ఫానుల్లా, తన స్నేహితులు మహ్మద్ ఫయాజ్, మహ్మద్ అలీతో కలిసి కారులో ముర్రేకు వెళుతుండగా, రాజధాని పోలీసుల యూనిఫాం ధరించి ప్రైవేట్ ఆల్టోలో ముగ్గురు వ్యక్తులు సంజానీ వద్ద తమను అడ్డగించారని ఐజీపీకి ఫిర్యాదు చేశారు.

ఆల్టోలో టింటెడ్ గ్లాసెస్ ఉన్నాయని, రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ చేతులు కట్టేసి తమ కారులోకి ఎక్కించారని, కళ్లకు గంతలు కట్టారని చెప్పారు.వారు వారిని ఒక ఫ్లాట్‌కి తీసుకెళ్లి, వారిపై నకిలీ కేసు నమోదు చేయడంతో పాటు తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. విడిచిపెట్టాలంటే ఒక మిలియన్ పాకిస్తానీ రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పాకిస్తానీ మీడియా ప్రచురణలో తెలిపింది. ఫిర్యాదుదారుడు తన కుటుంబాన్ని సంప్రదించి ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆ పోలీసులకు చెల్లించారు. ఈ నేరంలో నలుగురు పోలీసుల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. వారిపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. పోలీసులే అక్కడ డబ్బులకు కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేస్తున్నారు.


Next Story