నైజీరియాలో ఉగ్ర ఘాతుకం.. 50 మందికి పైగా దుర్మరణం
At least 50 people killed in shooting at church in Nigeria. నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం నాడు ఓ చర్చిపై కాల్పులు జరిపారు.
By Medi Samrat
నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం నాడు ఓ చర్చిపై కాల్పులు జరిపారు. బాంబు దాడులు కూడా చేశారు. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడగా అందరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు.
ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిపై దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశాన్ని, గాయపడిన వారిని ఆసుపత్రిలో సందర్శించిన ఒండో రాష్ట్ర గవర్నర్ అరకున్రిన్ ఒలువరోటిమి అకెరెడోలు, ఆదివారం నాటి సంఘటనను పెద్ద ఊచకోతగా అభివర్ణించారు, ఇది మళ్లీ జరగనివ్వకూడదని అన్నారు. దాడి చేసిన వారి గుర్తింపు మరియు ఉద్దేశ్యం వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఈ దాడిలో పారిష్కు చెందిన బిషప్, పాస్టర్లు క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు చెప్పారు. ఓవోలోని ఒక ఆసుపత్రిలోని ఒక వైద్యుడు రాయిటర్స్తో మాట్లాడుతూ దాడి నుండి పట్టణంలోని రెండు ఆసుపత్రులకు కనీసం 50 మృతదేహాలను తీసుకువచ్చినట్లు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స చేయడానికి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు.