నైజీరియా దేశంలోని కట్సినా రాష్ట్రంలో ఓ మాధ్యమిక పాఠశాలపై ముష్కరులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో ఏకే-47 రైఫిల్స్తో కంకరలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. దాడి అనంతరం వందలాది మంది విద్యార్థులు తప్పిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
కాగ, ముష్కరులు తమతో పాటు కొంతమంది విద్యార్ధులను బందీలుగా తీసుకెళ్లారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆ పాఠశాలలో 600కి పైగా విద్యార్ధులుండగా సుమారు 400 మందికి పైగా విద్యార్ధుల అచూకీ ఇప్పుడు లభించడం లేదని పోలీసు విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇసా తెలిపారు. నైజీరియా సైన్యం, పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు.