సూడాన్‌లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 38 మంది దుర్మరణం

38 killed in gold mine collapse in Sudan. సూడాన్‌ దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో మంగళవారం కనీసం 38 మంది

By అంజి  Published on  29 Dec 2021 2:28 AM GMT
సూడాన్‌లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 38 మంది దుర్మరణం

సూడాన్‌ దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో మంగళవారం కనీసం 38 మంది మరణించారని సూడాన్ అధికారులు తెలిపారు. రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్లు (435 మైళ్లు) దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి, పనిచేయని గని కూలిపోయినట్లు దేశ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దిష్ట లెక్కలు చెప్పకుండా చాలా మంది గాయపడ్డారని కూడా పేర్కొంది. మైనింగ్ కంపెనీ ఫేస్‌బుక్‌లో చిత్రాలను పోస్ట్ చేసింది. కనీసం ఇద్దరు డ్రెడ్జర్‌లు ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలను కనుగొనడానికి పని చేస్తున్నందున గ్రామస్థులు సైట్‌లో గుమిగూడారు. చనిపోయినవారిని పాతిపెట్టడానికి ప్రజలు సమాధులను సిద్ధం చేస్తున్నట్లు ఇతర చిత్రాలు చూపించాయి.

గని పని చేయడం లేదని, బంగారం కోసం తవ్వకాలు జరపడం లేదని కంపెనీ తెలిపింది. అయితే సైట్‌లో కాపలాగా ఉన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత స్థానిక మైనర్లు పని చేయడానికి తిరిగి వచ్చారు. గని ఎప్పుడు పనిచేయడం ఆగిపోయిందో చెప్పలేదు. స్థానికులు తరచూ బంగారం కోసం ఆ గనిలోకి వెళ్తుంటారని, ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా కాంటినెంట్‌లో సుడాన్‌ దేశం బంగారంలో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. గత సంవత్సరం 36.6 టన్నుల బంగారాన్ని సుడాన్‌ దేశం వెలికితీసింది. అయితే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి స్థానికులు అంటున్నారు.

Next Story