పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి

పాకిస్తాన్ లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 24 మంది గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి.

By Medi Samrat
Published on : 28 Jun 2025 3:57 PM IST

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి

పాకిస్తాన్ లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 24 మంది గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని ఖడ్డి ప్రాంతంలో ఈ ఉదయం బాంబు నిర్వీర్య విభాగానికి చెందిన మైన్-రెసిస్టెంట్ అంబుష్ ప్రొటెక్టెడ్ (MRAP) వాహనంపైకి పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు వర్గాలు తెలిపాయి. గాయపడిన 24 మందిలో మహిళలు, పిల్లలు సహా 14 మంది పౌరులు ఉన్నారు, వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో సైనిక కదలికలు కొనసాగుతున్నందున ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. పేలుడు తర్వాత భద్రతా సంస్థలు సహాయక చర్యలు ప్రారంభించాయి. హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపులోని ఉప విభాగం అయిన ఉసుద్ అల్-హర్బ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించిందని పాక్ మీడియా చెబుతోంది.

Next Story