కాబూల్ ఆత్మాహుతి దాడి.. 100 మందికి పైగా విద్యార్థులు మృతి

100 children killed in suicide bombing at Kabul school. కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో 100 మందికి పైగా మరణించారు

By Medi Samrat
Published on : 30 Sept 2022 4:06 PM IST

కాబూల్ ఆత్మాహుతి దాడి.. 100 మందికి పైగా విద్యార్థులు మృతి

కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో 100 మందికి పైగా మరణించారు. స్థానిక జర్నలిస్టు ప్రకారం, ఈ పేలుడు కారణంగా హజారాలు, షియా తెగలకు చెందిన విద్యార్థులు మరణించారు. హజారాలు ఆఫ్ఘనిస్తాన్ లో మూడవ అతిపెద్ద జాతి సమూహం. నగరానికి పశ్చిమాన ఉన్న దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలోని కాజ్ విద్యా కేంద్రంలో పేలుడు సంభవించిందని బీబీసీ నివేదించింది. స్థానిక జర్నలిస్ట్ బిలాల్ సర్వారీ ట్వీట్ చేస్తూ, "మేము ఇప్పటివరకు మా విద్యార్థుల 100 మృతదేహాలను లెక్కించాము. మరణించిన విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. తరగతి గది నిండిపోయింది. యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతూ ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఘటన ఇది" అని చెప్పుకొచ్చారు.

ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్‌ సెంటర్‌కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. యూనివర్శిటీ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతుండగా ఆత్మాహుతి బాంబు దాడిలో చాలా మంది మరణించారని పోలీసులు తెలిపారు. మైనారిటీ హజారా కమ్యూనిటీకి ప్రధానంగా షియా ముస్లింలు నివసించే పశ్చిమ కాబూల్‌లోని దాష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో ఈ పేలుడు జరిగింది. కాజ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ సెంటర్ విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ ఇస్తుంది. "భద్రతా బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి, మృతుల వివరాలు తరువాత విడుదల చేయబడతాయి." అని అధికారులు తెలిపారు.


Next Story