ఏడిపించిన వారిని చంపడానికి స్కూలుకు గన్ తీసుకుని వెళ్లిన విద్యార్థి.. 10 మంది మృతి

మంగళవారం ఆస్ట్రియాలోని గ్రాజ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ప‌ది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

By Medi Samrat
Published on : 10 Jun 2025 8:42 PM IST

ఏడిపించిన వారిని చంపడానికి స్కూలుకు గన్ తీసుకుని వెళ్లిన విద్యార్థి.. 10 మంది మృతి

మంగళవారం ఆస్ట్రియాలోని గ్రాజ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ప‌ది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా చాలా మరణాలు సంభవించాయని ధృవీకరించింది. ఆ సంఖ్యను చెప్పలేదు. ఎంతమంది విద్యార్థులు, ఎంత మంది అధ్యాపకులు గాయపడ్డారనే వివరాలను కూడా ఇవ్వలేదు. స్థానిక వార్తా ఛానెల్‌లు మాత్రం ఈ సంఘటనలో కనీసం ప‌ది మంది మరణించారని చెబుతున్నాయి.

కాల్పులకు పాల్పడ్డ అనుమానితుడు విద్యార్థి అని.. తనను ఏడిపించిన వారిని చంపడానికి గన్ తీసుకుని వచ్చాడని, చివరికి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు ఆస్ట్రియన్ రాష్ట్ర మీడియా ORFను ఉటంకిస్తూ ఇండిపెండెంట్ నివేదించింది. పాఠశాల లోపల కాల్పుల శబ్దాలు వినిపించిన తర్వాత ఉదయం 10 గంటల నుండి నగరంలో ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story