అదరగొట్టిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు
By Medi Samrat Published on 11 Oct 2019 1:16 PM GMTరెండో టెస్టు : రెండో టెస్టులోనూ సౌతాఫ్రికాపై టీమిండియా అదరగొడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 336 బంతుల్లో 33 ఫోర్ లు, 2 సిక్స్లతో తన అత్యధిక స్కోరును తానే అధిగమించాడు. కోహ్లీకి తోడుగా జడేజా కూడా 91 పరుగులతో మెరిశాడు. కాగా టీమిండియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
తర్వాత తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు మొదటిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఉమేష్ యాదవ్కు రెండు, షమి ఒక వికెట్ లభించింది. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 36 పరుగుల చేసింది. క్రీజులో బ్రూయిన్ (20), నోర్జె (2) ఉన్నారు. ఇంకా టీమిండియా కంటే 565 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా జట్టు ఉంది.
Next Story