ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి.. ఒవైసీ పిలుపు

తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది, సోమవారం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

By Medi Samrat
Published on : 13 May 2024 9:03 AM IST

ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి.. ఒవైసీ పిలుపు

తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది, సోమవారం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత కూడా ఓటు వేశారు.

ఓటు వేసిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రజలను కోరారు. 'ఐదేళ్ల క్రితం జరిగినట్లుగా ప్రతి ఎన్నికలు జరగకూడదు. సవాళ్లు వేరు, సమస్యలు వేరు. ఇవి మన దేశంలో చాలా ముఖ్యమైన, చారిత్రాత్మకమైన పార్లమెంట్ ఎన్నికలు. దేశానికి ఏం కావాలో ప్రజలకు భిన్నమైన అవగాహన ఉంది. పార్లమెంటు ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా ఎన్నికలను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోవాలి. ఎన్నికలంటే ఎన్నికలే. ప్రత్యర్థిని మనం ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంది' అని ఒవైసీ విలేకరులతో అన్నారు.

Next Story