మొత్తం దేశాన్ని దోచుకుంటున్నారు.. మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్
‘Money Heist’ hoarding at LB Nagar calls PM Modi ‘nation robber. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైద్రాబాద్ నగరం
By Medi Samrat Published on 1 July 2022 9:44 AM GMT
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైద్రాబాద్ నగరం ముస్తాబవుతున్న వేళ.. శుక్రవారం ఎల్బి నగర్ సర్కిల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఓ హోర్డింగ్ వెలిసింది. ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తూ భారీ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. సూపర్ హిట్ షో 'మనీ హీస్ట్'లోని పాత్రలను చూపుతూ.. "మిస్టర్ ఎన్ మోదీ.. మేము బ్యాంకును మాత్రమే దోచుకుంటాము, మీరు మొత్తం దేశాన్ని దోచుకుంటున్నారు" అని క్యాప్షన్ తో హోర్డింగ్ను ఏర్పాటు చేశారు.
అంతకుముందు పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట, హైటెక్ సిటీ, అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్, మాదాపూర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లు దర్శనమిచ్చాయి. ప్లెక్సీలలో #ByeByeModi అనే హ్యాష్ట్యాగ్ ను ప్రచురించారు. 'సాలు మోడీ, సంపకు మోడీస అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలు, అగ్నిపథ్ పథకం, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు సంబంధించిన వంటి అంశాలను బ్యానర్లు, ప్లెక్సీలలో ప్రస్తావించారు. ఈ ప్లెక్సీలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు.