తెలంగాణ ప్రభుత్వంతో 'కూ' ఎంవోయూ..

Koo MOU with Telangana Govt. భారతదేశం ఎంతో ఇష్టపడే వివిధ భాషా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ

By Medi Samrat  Published on  20 July 2022 1:03 PM GMT
తెలంగాణ ప్రభుత్వంతో కూ ఎంవోయూ..

భారతదేశం ఎంతో ఇష్టపడే వివిధ భాషా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ(koo) హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై చేసుకుంది. హైదరాబాద్ ఒక ఐటీ హబ్‌గా ఉండటం, బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం.. ఐటీ ప్రతిభను కలిగి ఉన్న పెద్ద సమూహాన్ని కలిగి ఉండటంతో కూ (Koo) ఈ ప్రాంతంలో తన ఉనికిని గణనీయమైన రీతిలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. 10 భాషలలో యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్‌ గణనీయమైన కమ్యూనిటీని కలిగి ఉంది.

ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగు వాడకంపై కూతో కలిసి పని చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక సంస్కృతితో పాటు, ఒక భాషగా తెలుగు యొక్క వారసత్వాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది.

మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, "ప్రభుత్వ ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా ఒక ముఖ్యమైన యంత్రాంగమని మేము గట్టిగా నమ్ముతున్నాము. కూ (koo) తో సహకరించడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం యొక్క సమాచారం, సేవలను వ్యాప్తి చేయడం కోసం పౌరులతో కనెక్ట్ అయ్యేందుకు మా ప్రయత్నాలు మరింతగా పెరుగుతాయని మేము ఆశిస్తున్నామన్నారు.

ఎమ్ఒయుపై తన ఆలోచనలను పంచుకుంటూ, కూ ఫౌండర్, సిఈఒ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యంగా భారతదేశం వంటి బ‌హుభాషా దేశంలో "భాషా ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఈ సమయంలో అవసరమన్నారు. తటస్థంగా, స్వతంత్రంగా ఉండటం కోసం కూ అనేది భారతీయులకు ఎంపిక చేసుకునే వేదిక. తెలంగాణ ప్రభుత్వంతో సహకరించడం మాకు నిజంగా గౌరవం అని అన్నారు.

















Next Story