ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.

By Medi Samrat
Published on : 6 Sept 2025 1:45 PM IST

ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంతో నవరాత్రుల పాటు అశేష భక్తజన పూజలందుకున్న గణనాథుడి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

శనివారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గణనాథుడి శోభాయాత్ర, మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని వినియోగించారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, భారీ క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్‌లోకి నిమజ్జనం చేశారు.

Next Story