Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
By అంజి
Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యతో మాగంటి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మాగంటి.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు.
#Telangana #Hyderabad MLA Maganty Gopinath, 63 years declared dead at @AIGHospitals at 5.45 am. He was admitted on 5th June at around 2.56 pm with massive heart attack @NewsMeter_In@NewsmeterTelugu
— Kaniza Garari (@KanizaGarari) June 8, 2025
1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు మాగంటి గోపినాథ్ జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో మాగంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి.. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా ఉన్నారు.
1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసిన మాగంటి. 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మాగంటి.. ఆ తర్వాత తరువాత టిఆర్ఎస్ లో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా పని చేసిన మాగంటి.. జనవరి 26 2022న బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 వరుసగా మూడో సారి జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా మాగంటి గెలుపొందారు.