డ్రగ్స్ కలిపిన చాక్లెట్లను ఆన్ లైన్ లో అమ్ముతున్న విద్యార్థి

Hyderabad MBA student held for selling drug-laced chocolates on social media. హాష్ ఆయిల్ కలిపిన చాక్లెట్ బార్లను విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ఫార్మాస్యూటికల్ కంపెనీ

By Medi Samrat
Published on : 6 Nov 2022 3:00 PM

డ్రగ్స్ కలిపిన చాక్లెట్లను ఆన్ లైన్ లో అమ్ముతున్న విద్యార్థి

హాష్ ఆయిల్ కలిపిన చాక్లెట్ బార్లను విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని కుమారుడు, మేనేజ్‌మెంట్ విద్యార్థిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆ వ్యక్తి దగ్గర 48 చాక్లెట్ బార్లు, 40 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నార్సింగికి చెందిన రిషి సంజయ్ మెహతా (22) సోషల్ మీడియా ఖాతాల ద్వారా డ్రగ్స్ కలిపిన చాక్లెట్ల కోసం ఆర్డర్లు తీసుకునేవాడు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా డబ్బు అందుకున్న తర్వాత వారికి పంపించేవాడని హైదరాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ముషీరాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) సిబ్బంది మెహతాను పట్టుకున్నారు. ఇంట్లో నుంచి మెహతా మొబైల్‌ ఫోన్‌, చాక్లెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో మెహతా గంజాయి, హాష్‌ ఆయిల్‌కు బానిసైనట్లు విచారణలో తేలింది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఖర్చుల కోసం, అతను ఈ-సిగరెట్లను విక్రయించడం ప్రారంభించాడు. తరువాత ఆదాయ వనరుగా డ్రగ్స్ కలిపిన చాక్లెట్లను విక్రయించడం ప్రారంభించాడు.


Next Story