'ట్రంప్ పేరే ఎందుకు.. ఆ రోడ్డుకు అమరవీరుడి పేరు పెట్టలేరా?': తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజా సింగ్
హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను డిసెంబర్ 8 సోమవారం గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ప్రశ్నించారు.
By - అంజి |
'ట్రంప్ పేరే ఎందుకు.. ఆ రోడ్డుకు అమరవీరుడి పేరు పెట్టలేరా?': తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజా సింగ్
హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను డిసెంబర్ 8 సోమవారం గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన తెలంగాణ అమరవీరులలో ఎవరి పేర్లనైనా ఆ రోడ్డుకు పేరు పెట్టవచ్చని ఆయన అన్నారు. ఒక వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. “తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఇస్ సే నా కుచ్ ఆనే కా హై, నా కుచ్ జకనే కా (ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు). ప్రభుత్వం దాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది” అని అన్నారు.
హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ , “తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అనేక మంది అమరవీరులలో ఒకరి పేరును ముఖ్యమంత్రి ఎందుకు పెట్టలేరని నేను అడగాలనుకుంటున్నాను?” అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఆ రోడ్డు పేరును భాగ్యనగర్గా కూడా మార్చవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
Goshamahal MLA, T Raja Singh, on Monday, December 8 questioned the state government for renaming the US Consulate road in Hyderabad after American President Donald Trump.He said that the road could be renamed after any of the Telangana martyrs who sacrificed their lives for the… pic.twitter.com/thpeLhv2Fi
— The Siasat Daily (@TheSiasatDaily) December 9, 2025
అమెరికా కాన్సులేట్ రోడ్డు పేరు మార్చనున్న ప్రభుత్వం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత రాజా సింగ్ విమర్శలు వచ్చాయి.
హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ వెంబడి ఉన్న హై ప్రొఫైల్ రహదారిని 'డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పిలవనున్నారు," అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి ఒక పత్రికా ప్రకటన తెలిపింది. డిసెంబర్ 8-9 వరకు ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. అదే రోజున, రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డు (RRR)తో అనుసంధానించే రాబోయే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది, రావిర్యాల వద్ద ఉన్న ఇంటర్చేంజ్కు ఇప్పటికే 'టాటా ఇంటర్చేంజ్' అని పేరు పెట్టారు.