మొయినాబాద్‌లోకి బయటి వ్యక్తులెవ‌రూ రావొద్దు.. పోలీసుల ఉత్తర్వులు

సోమవారం చిలుకూరు గ్రామంలో ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

By Medi Samrat  Published on  24 July 2024 1:19 PM GMT
మొయినాబాద్‌లోకి బయటి వ్యక్తులెవ‌రూ రావొద్దు.. పోలీసుల ఉత్తర్వులు

సోమవారం చిలుకూరు గ్రామంలో ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు మొయినాబాద్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడడాన్ని అధికారులు నిషేధించారు. ఆ ప్రాంతంలో నివసించని లేదా ఆ ప్రాంతంలో పనులు చేయని వ్యక్తులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వులు జూలై 24 (బుధవారం) ఉదయం 6 గంటల నుండి జూలై 30 (మంగళవారం) రాత్రి 11 గంటల వరకు అమలులో ఉంటాయి. చిలుకూరులో మసీదు నిర్మాణానికి నిరసనగా భజరంగ్ దళ్ చలో మొయినాబాద్ పిలుపునిచ్చింది.

Next Story