Hyderabad : పబ్‌లో దొంగ కాల్పులు.. కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు

ఫిబ్రవరి 1, శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో ఓ దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.

By Medi Samrat
Published on : 2 Feb 2025 9:39 AM IST

Hyderabad : పబ్‌లో దొంగ కాల్పులు.. కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు

ఫిబ్రవరి 1, శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో ఓ దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకట్ రామ్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది ప్రభాకర్ అనే నేరస్థుడు, నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రిజం పబ్‌కు వెళ్లినప్పుడు ఈ కాల్పులు జరిగాయి. ఇతనిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. పోలీసులను చూడగానే ప్రభాకర్ కాల్పులు జరపగా అందులో ఒక బుల్లెట్ కానిస్టేబుల్ వెంకట్ రామ్ రెడ్డి ఎడమ పాదంలోకి దూసుకుపోయింది.

గాయపడిన కానిస్టేబుల్‌, బౌన్సర్‌ను చికిత్స నిమిత్తం కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. ఇతర బౌన్సర్ల మద్దతుతో పోలీసులు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆసుపత్రిలో పరామర్శించారు. కేసు నమోదు చేశారు

Next Story