Jubilee Hills Bypoll : ఉదయం 8 గంటలకు మొదలు.. వారే అక్కడకు వెళ్ళాలి..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 13 Nov 2025 7:57 PM IST

Jubilee Hills Bypoll : ఉదయం 8 గంటలకు మొదలు.. వారే అక్కడకు వెళ్ళాలి..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రేపు ఉదయం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్వో కర్ణన్ తెలిపారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.

ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్న వారు మాత్రమే లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని అధికారులు సూచించారు.

Next Story