గుల్బర్గాకు 80కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం

By సుభాష్  Published on  14 Oct 2020 10:48 AM GMT
గుల్బర్గాకు 80కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం

వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఏపీ-కర్ణాటక, మహారాష్ట్ర - తెలంగాణపై కొనసాగుతున్నవాయుగుండం భూ భాగంపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వాయుగుండం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్యదిశగా 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తోంది. అయితే ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆరేబియా సముద్రంపైకి వెళ్లనున్నట్లు భావిస్తోంది.

16నాటికి ఆరేబియా సముద్రంలోకి వెళ్లిన అనంతరం .. అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర-గుజరాత్‌కు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షోలాపూర్‌, విదర్బ, మరట్వాడా ప్రాంతాల్లో అతి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో 15 నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story