FactCheck : ఆలస్యంగా వస్తున్న టీచర్ల శాలరీల్లో తమిళనాడు ప్రభుత్వం కోత విధిస్తూ ఉందా..?

Will TN Government Deduct Salaries of Teachers for late Arrival. పాఠశాలకు ఆలస్యంగా వస్తున్న టీచర్ల శాలరీల్లో తమిళనాడు ప్రభుత్వం కోత

By Medi Samrat  Published on  30 July 2022 2:53 PM GMT
FactCheck : ఆలస్యంగా వస్తున్న టీచర్ల శాలరీల్లో తమిళనాడు ప్రభుత్వం కోత విధిస్తూ ఉందా..?

పాఠశాలకు ఆలస్యంగా వస్తున్న టీచర్ల శాలరీల్లో తమిళనాడు ప్రభుత్వం కోత విధించబోతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆగస్ట్ 1వ తారీఖు నుండి తమిళనాడు అంతటా అమలు చేయబోతున్నారంటూ కథనాలను ప్రసారం చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'

తమిళ సమయం అనే వెబ్‌సైట్.. వైరల్ పోస్ట్ గురించి తమిళనాడు పాఠశాల విద్యా శాఖను సంప్రదించింది. ఉపాధ్యాయుల హాజరును స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతోందని.. అయితే ఆగస్టు 1 నుంచి యాప్ ద్వారా ఉదయం 10 గంటలలోపు ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకోకుంటే వేతనంలో కోత విధిస్తామంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. అలాంటిది ప్రకటించలేదని ఆ శాఖ పేర్కొంది."

పాఠశాలల్లో జరిగే అన్ని సంఘటనలకు ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కళ్లకురిచ్చి ఘటనపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ.. 77 మార్గదర్శకాలతో కూడిన కొత్త సర్క్యులర్‌ను అన్ని పాఠశాలలకు పంపింది. ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయుల హాజరును యాప్‌ ద్వారా నమోదు చేసేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జూలై 18న తమిళనాడులోని కళ్లకురిచ్చిలో 12వ తరగతి విద్యార్థి మరణించిన తర్వాత ఈ వైరల్ పోస్ట్ వచ్చింది. కళ్లకురిచ్చి ఘటన తర్వాత పలు నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా తయారయ్యాయి. విద్యార్థులు, బాలిక కుటుంబ సభ్యులతో సహా వందలాది మంది స్కూల్ ను ధ్వంసం చేసి పోలీసులతో ఘర్షణకు దిగారు.

DT NEXT ద్వారా 1 జూలై 2018న ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. "ప్రభుత్వం యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని భావిస్తోందని.. అలా చేయడం వలన ఉపాధ్యాయులు తప్పనిసరిగా స్కూల్స్ కు హాజరవుతారు" అనే కథనం ఉంది. ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మొత్తం 100% హాజరు ఉండేలా పాఠశాల విభాగం హాజరు విధానాన్ని తీసుకుని వచ్చిందని అందులో ఉంది.

TN DIPR ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఈ వైరల్ కథనం ఫేక్ అని కొట్టివేసింది.

కాబట్టి, వైరల్ అవుతున్న కథనంలో ఎలాంటి నిజం లేదు.


Claim Review:ఆలస్యంగా వస్తున్న టీచర్ల శాలరీల్లో తమిళనాడు ప్రభుత్వం కోత విధిస్తూ ఉందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story