FactCheck : పులి దాడి చేస్తున్న చిత్రాలు జార్ఖండ్ లో చోటు చేసుకున్నవా..?

Viral Pictures are not related to Jharkhand tiger Attack. పులి దాడి చేసినట్లుగా.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2022 8:16 AM GMT
FactCheck : పులి దాడి చేస్తున్న చిత్రాలు జార్ఖండ్ లో చోటు చేసుకున్నవా..?

పులి దాడి చేసినట్లుగా.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జార్ఖండ్‌లోని పలాజోరిలో ఇటీవల పులి దాడికి సంబంధించిన చిత్రాలు ఇవని వినియోగదారులు పేర్కొన్నారు.


https://www.facebook.com/100065060767960/posts/pfbid034sj61hJVdkWYhLocKZCJwAov83giLayzbiSeqazhCB4sVCQTfYhod773HjBhWsXQl/

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది, మేము ఇలాంటి చిత్రాలతో కూడిన తెలుగు మీడియా కథనాన్ని చూశాము. నివేదిక ప్రకారం.. ఈ సంఘటన 19 జూన్ 2022 న జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కిడిసింగి గ్రామంలో 72 ఏళ్ల వృద్ధుడిని ఎలుగుబంటి చంపింది. ఆ మరుసటి రోజే గ్రామానికి చెందిన ఆరుగురిపై ఎలుగుబంటి దాడి చేసింది.

https://m.andhrajyothy.com/telugunews/six-members-seriously-injured-in-bear-attack-mrgs-andhrapradesh-1822062011462973#group=nogroup&photo=0

కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించి, మేము 20 జూన్ 2022న వార్తా సంస్థలు ప్రసారం చేసిన ఇలాంటి విజువల్స్ కనుగొన్నాము. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఎలుగుబంటి దాడిలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. ఎలుగుబంటిని ఆ తరువాత బంధించారు. జార్ఖండ్‌లోని పలాజోరి ప్రాంతంలో టైగర్ దాడి చేసిందనే వార్తా కథనాన్ని మేము కనుగొనలేకపోయాము.

https://www.thenewsminute.com/article/eight-andhra-farmers-injured-bear-attack-efforts-capture-animal-165123


https://www.newindianexpress.com/states/andhra-pradesh/2022/jun/21/six-severely-injured-in-bear-attack-in-srikakulam-2468036.html


కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎలాంటి నిజం లేదు'.


































Next Story