Fact Check : అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారా..?

Temple in viral image Picture of gigantic mace is from Gujarat, not Ayodhya. భారీ ధనుస్సు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన

By Medi Samrat
Published on : 19 Dec 2020 3:37 PM IST

Fact Check : అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారా..?

భారీ ధనుస్సు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఓ కూడలిలో ఈ భారీ ధనుస్సును ఏర్పాటు చేశారని ఫోటో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. నెటిజన్లు ఈ ధనుస్సును అయోధ్యలో ఏర్పాటు చేశారంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.



అధర్మం మీద ధర్మం గెలుపునకు గుర్తుగా భారీ ధనుస్సును ఏర్పాటు చేశారని చెబుతూ పోస్టుల్లో చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ ఈ ఫోటో పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వైరల్ పోస్టు జూన్ 2020 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. అయోధ్యలో ఈ భారీ ధనుస్సును ఏర్పాటు చేశారని చెబుతున్నప్పటికీ.. కామెంట్స్ లో వడోదర, గుజరాత్ అని చెప్పారు.



కామెంట్ల ప్రకారం కీవర్డ్ సెర్చ్ చేయడమే కాకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. గుజరాత్ లోని వడోదర లో ఉన్న హరిణి రోడ్ లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ 15, 2016న వడోదరలోని శ్రీ భీడ్ భజన్ సర్కిల్ లో ఈ ధనుస్సును ఏర్పాటు చేశారు.

అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఇది గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేశారు.


Claim Review:అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story