Fact Check : స్వాతంత్ర్య సమరయోధుల బంధువులు కంగనా రనౌత్ పోస్టర్స్ కు నలుపు రంగు పూసారా..?

Old Video of Protests Against Kangana Passed off as Recent. నవంబర్ 12న సినీ నటి కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారనే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2021 2:21 PM GMT
Fact Check : స్వాతంత్ర్య సమరయోధుల బంధువులు కంగనా రనౌత్ పోస్టర్స్ కు నలుపు రంగు పూసారా..?

నవంబర్ 12న సినీ నటి కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశ స్వాతంత్ర్యం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు స్వాతంత్ర్య సమరయోధుల బంధువులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా ఒక పెద్ద పోస్టర్‌ను పాదరక్షలతో కొట్టి, నల్ల ఇంకు విసిరి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఇటీవల జరిగిందని వినియోగదారులు పేర్కొన్నారు.

ఆ వీడియోలో కంగనా రనౌత్ ఫోటోలను చెప్పులతో కొట్టిన దేశ ప్రజలు ఇప్పుడు మంచి స్వేచ్ఛను ఇస్తున్నారు అని ఉంది. 'కంగనా రనౌత్ ఫోటోను దేశ ప్రజలు చెప్పులతో కొట్టారు' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో వీడియో షేర్ అవుతోంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం ఈ ఘటన ఇప్పుడు చోటు చేసుకున్నది కాదని న్యూస్ మీటర్ తెలుసుకుంది.

NewsMeter సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది. అదే వైరల్ వీడియోను కలిగి ఉన్న ETV భారత్ సెప్టెంబర్ 2020 నివేదికను కనుగొంది. థానే శివసేన మహిళా విభాగం నటి కంగనా రనౌత్‌పై "ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చినందుకు మరియు మాఫియా కంటేపోలీసులకే ఎక్కువ భయపడుతున్నట్లు పేర్కొన్నందుకు" వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది.

Mumbai Mirror, ABP News, Hindustan Times మీడియా సంస్థలు కూడా ఈ విషయంపై కథనాలను ప్రసారం చేశాయి. "శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నన్ను బహిరంగంగా బెదిరించాడు మరియు ముంబైకి తిరిగి రావద్దని అడిగాడు, ముంబై నాకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా అనిపిస్తోంది?" అంటూ వివాదాస్పద ట్వీట్లు చేసింది. దీంతో తీవ్ర దుమారం రేగింది.

ఇది థానే, పూణే మరియు నాసిక్‌తో సహా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నటికి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనకు దారితీసింది. నిరసనగా కంగనా దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.

ఇండియా టుడే మరియు ABP న్యూస్‌ల వీడియో రిపోర్టులలో కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ సంఘటనపై ప్రతిస్పందనగా, రనౌత్ మరో ట్వీట్ చేశారు. "సుశాంత్ మరియు సాధువుల హత్య తర్వాత, పరిపాలనపై నా అభిప్రాయాల కోసం ఇప్పుడు నా పోస్టర్‌లను చప్పుళ్లతో కొట్టడం, ముంబై రక్తానికి బానిస అయినట్లు కనిపిస్తోంది' అని ABP న్యూస్ నివేదించింది.


స్పష్టంగా తెలుస్తోంది ఏమిటంటే వైరల్ వీడియో ఇటీవలిది కాదు. 2020 సెప్టెంబర్‌లో ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడంపై కంగనా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇది జరిగింది.

కాబట్టి వైరల్ పోస్టుల్లోని వీడియో ఇప్పటిది కాదు.


Claim Review:స్వాతంత్ర్య సమరయోధుల బంధువులు కంగనా రనౌత్ పోస్టర్స్ కు నలుపు రంగు పూసారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook Users
Claim Fact Check:False
Next Story