FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
By - న్యూస్మీటర్ తెలుగు |
రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాడికి గురైన వ్యక్తి బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజు అని వీడియోను షేర్ చేస్తున్న వారు చెబుతూ ఉన్నారన్నారు. ఇటీవల అతని ఇంటి ముందు దారుణంగా దాడికి గురయ్యారని పేర్కొన్నారు.
“తమిళనాడు: బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజుని నిన్న సాయంత్రం అతని ఇంటి ముందు దారుణంగా కొట్టారు. రాజేష్ చెన్నై తూర్పు నంగనల్లూరులోని శ్రీ చక్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ” అని వీడియోను షేర్ చేశారు ఒక X వినియోగదారుడు.
చాలా మంది X వినియోగదారులు.. వైరల్ అవుతున్న వాదనతోనే వీడియోను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
2023లో చెన్నైలోని నంగనల్లూర్లో బీజేపీలోని రెండు వర్గాల మధ్య జరిగిన పోరును చూపుతున్నందున ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్మీటర్ కనుగొంది.
గ్రేటర్ చెన్నై పోలీసు అధికారిక X హ్యాండిల్ లో వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులకు సమాధానమిచ్చారు. ఈ సంఘటన జూలై 31, 2023న నంగనల్లూరులో జరిగిందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.
The video pertains to a fight that occurred due to personal dispute between two factions of a political party @ Nanganallur and which happened on 31.07.2023 NOT yesterday. In this regard, a case was registered in the jurisdictional police station and proper legal action was… pic.twitter.com/DbgOMLruXS
— GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) April 15, 2024
సన్ న్యూస్ X హ్యాండిల్ వీడియోను ఆగస్ట్ 1, 2023న పోస్ట్ చేసిందని కూడా మేము కనుగొన్నాము. ఆ పోస్ట్తో పాటుగా ఉన్న క్యాప్షన్లో చెన్నై తూర్పు జిల్లా BJP ప్రధాన కార్యదర్శి SS సుబ్బయ్య తన పార్టీ సభ్యుడు రాజేష్ బిజుపై దాడి చేశారని పేర్కొంది.
#BREAKING | சொந்த கட்சி உறுப்பினரையே தாக்கிய சென்னை கிழக்கு மாவட்ட பாஜக பொதுச்செயலாளர் எஸ்.எஸ்.சுப்பையா மீது வழக்குப்பதிவு!
— Sun News (@sunnewstamil) August 1, 2023
#SunNews | #BJP | #BJPTamilnadu pic.twitter.com/S3meGTMH7i
ఆగస్టు 1, 2023 న ETV భారత్ నివేదిక ప్రకారం సుబ్బయ్య తన స్నేహితులతో మద్యం సేవిస్తున్న వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను బిజూ సర్క్యులేట్ చేశారని సుబ్బయ్య ఆరోపిస్తూ నంగనల్లూరులోని అతనిపై దాడి చేశారు.
తమిళ మీడియా సంస్థ దినకరన్, ఆగస్ట్ 1, 2023న ప్రచురించిన ఒక నివేదికలో, బిజూ క్రోమ్పేట్లో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ దాడి చేసినందుకు సుబ్బయ్యపై కేసు నమోదు చేసినట్లు కూడా పేర్కొంది.
అందువల్ల, ఈ సంఘటన 2023 నాటిది. బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యుల మధ్య వివాదానికి సంబంధించినది. కాబట్టి ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam