FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?

రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 April 2024 12:15 PM GMT
FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?

రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాడికి గురైన వ్యక్తి బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజు అని వీడియోను షేర్ చేస్తున్న వారు చెబుతూ ఉన్నారన్నారు. ఇటీవల అతని ఇంటి ముందు దారుణంగా దాడికి గురయ్యారని పేర్కొన్నారు.


“తమిళనాడు: బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజుని నిన్న సాయంత్రం అతని ఇంటి ముందు దారుణంగా కొట్టారు. రాజేష్ చెన్నై తూర్పు నంగనల్లూరులోని శ్రీ చక్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ” అని వీడియోను షేర్ చేశారు ఒక X వినియోగదారుడు.

చాలా మంది X వినియోగదారులు.. వైరల్ అవుతున్న వాదనతోనే వీడియోను షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

2023లో చెన్నైలోని నంగనల్లూర్‌లో బీజేపీలోని రెండు వర్గాల మధ్య జరిగిన పోరును చూపుతున్నందున ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

గ్రేటర్ చెన్నై పోలీసు అధికారిక X హ్యాండిల్ లో వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులకు సమాధానమిచ్చారు. ఈ సంఘటన జూలై 31, 2023న నంగనల్లూరులో జరిగిందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.

సన్ న్యూస్ X హ్యాండిల్ వీడియోను ఆగస్ట్ 1, 2023న పోస్ట్ చేసిందని కూడా మేము కనుగొన్నాము. ఆ పోస్ట్‌తో పాటుగా ఉన్న క్యాప్షన్‌లో చెన్నై తూర్పు జిల్లా BJP ప్రధాన కార్యదర్శి SS సుబ్బయ్య తన పార్టీ సభ్యుడు రాజేష్ బిజుపై దాడి చేశారని పేర్కొంది.

ఆగస్టు 1, 2023 న ETV భారత్ నివేదిక ప్రకారం సుబ్బయ్య తన స్నేహితులతో మద్యం సేవిస్తున్న వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను బిజూ సర్క్యులేట్ చేశారని సుబ్బయ్య ఆరోపిస్తూ నంగనల్లూరులోని అతనిపై దాడి చేశారు.

తమిళ మీడియా సంస్థ దినకరన్, ఆగస్ట్ 1, 2023న ప్రచురించిన ఒక నివేదికలో, బిజూ క్రోమ్‌పేట్‌లో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ దాడి చేసినందుకు సుబ్బయ్యపై కేసు నమోదు చేసినట్లు కూడా పేర్కొంది.

అందువల్ల, ఈ సంఘటన 2023 నాటిది. బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యుల మధ్య వివాదానికి సంబంధించినది. కాబట్టి ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X, Facebook
Claim Fact Check:Misleading
Next Story