FactCheck : 2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక టిప్పు సుల్తాన్‌ ఉన్న శకటాన్ని పంపించిందా?

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు సందడి చేశాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jan 2025 3:48 PM IST
FactCheck : 2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక టిప్పు సుల్తాన్‌ ఉన్న శకటాన్ని పంపించిందా?

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు సందడి చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటం పంపింది. ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు పేరుగాంచాయి.

ఈ వేడుకలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, సాంకేతిక పురోగతిలో భాగమయ్యాయి. ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి పాల్గొన్నారు. భారత్- ఈజిప్టు దేశాల మధ్య లోతైన సంబంధాలను ప్రతిబింబించింది. ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మైసూర్ మాజీ పాలకుడి బొమ్మను కర్ణాటక తన శకటంగా చూపించిందని ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఒక ఫేస్‌బుక్ వినియోగదారు శకటం చిత్రాన్ని షేర్ చేసి.. “మీరు టిప్పు సుల్తాన్‌ను చాలా ద్వేషిస్తున్నారు, అయినప్పటికీ మీరు అతని గౌరవార్థం ఊరేగింపు చేయవలసి ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ముస్లింలారా, మిమ్మల్ని ద్వేషించే వారు కూడా మిమ్మల్ని కీర్తించేలా మీ స్థాయిని పెంచుకోండి.” అంటూ పోస్టు పెట్టారు.


నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ చిత్రం 2014 నాటిది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, జనవరి 27, 2014 నాటి NDTV రిపోర్ట్‌లో, ‘Tipu Sultan tableau on Republic Day sparks war on Twitter’ అనే శీర్షికతో ఉన్న కథనాన్ని మేము కనుగొన్నాము.

నివేదిక ప్రకారం, రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం తమ శకటంలో టిప్పు సుల్తాన్‌ను చేర్చడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చాలా మంది విమర్శలు గుప్పించారు. వేలమంది హిందువులను చంపిన టిప్పు సుల్తాన్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైనది కాదని తెలిపారు.

జనవరి 26, 2014, ఇండియా టుడే నివేదికలో ‘Trending on Twitter: Karnataka’s Tipu Sultan tableau at Republic Day parade’ అనే శీర్షికతో మేము వైరల్ చిత్రాన్ని కనుగొన్నాము.

రాజ్‌పథ్‌లోని రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక శకటంలో టిప్పు సుల్తాన్ కనిపించడం ట్విట్టర్‌లో మాటల యుద్ధానికి కారణమైంది.


NDTV 2014 రిపబ్లిక్ డే పరేడ్‌లో టిప్పు సుల్తాన్ శకటం ఉన్న వీడియోను '200 years later, Tipu Sultan’s Karnataka debates his legacy' అనే శీర్షికతో ప్రచురించారు. జనవరి 26, 2014 న దూరదర్శన్ నేషనల్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో 1:59:32 వద్ద టిప్పు సుల్తాన్ శకటం కనిపిస్తుంది.

2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక శకటం?

జనవరి 26, 2025న ది హిందూ, హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన PTI నివేదిక ప్రకారం, 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కర్ణాటక శకటంలో చారిత్రక నగరం లక్కుండిలోని ప్రముఖ దేవాలయాలను చూడొచ్చు.

ముందు భాగంలో బ్రహ్మ జినాలయ ఆలయం నుండి బ్రహ్మ విగ్రహం ఉంది, ఇది లక్కుండిలోని పురాతన జైన మందిరం మహావీర స్వామికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆలయం మంటపం ఉంది. జనవరి 26, 2025న, PTI నివేదికలో వివరించిన అదే విజువల్స్‌ను ప్రదర్శిస్తూ, కర్ణాటక శకటం వీడియోను Sansad TV అప్లోడ్ చేసింది.

కాబట్టి, 2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక శకటంలో టిప్పు సుల్తాన్ కనిపించలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.

Credit : Md Mahfooz Alam

Claim Review:2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక టిప్పు సుల్తాన్‌ ఉన్న శకటాన్ని పంపించిందా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Next Story