Fact Check: పాకిస్థాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు యూపీ పోలీసులు బహిరంగంగా లాఠీలతో కొట్టారా?

రోడ్డుపై ఉన్న ముగ్గురు యువకులను లాఠీలతో పోలీసులు కొట్టడం, జనం చూస్తుండగానే ఇదంతా జరుగుతూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By అంజి
Published on : 9 Jun 2025 1:27 PM IST

NewsMeterFactCheck, Uttarpradesh, Andhrapradesh,Pakistan

Fact Check: పాకిస్థాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు యూపీ పోలీసులు బహిరంగంగా లాఠీలతో కొట్టారా? 

రోడ్డుపై ఉన్న ముగ్గురు యువకులను లాఠీలతో పోలీసులు కొట్టడం, జనం చూస్తుండగానే ఇదంతా జరుగుతూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఈ యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని, అందుకే పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకున్నారనే వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఫుటేజ్‌లో పోలీసు అధికారులు వారి పాదాల మీద కొడుతుండగా, నొప్పితో కేకలు వేస్తున్నారు. వీడియో చివరలో, ఒక అధికారి మూడవ వ్యక్తిని మోకాళ్లపై తొక్కడం చూడొచ్చు, మరొకరు అతని పాదాలపై బాదుతూనే ఉన్నారు.

ఒక X యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, “పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పే వ్యక్తులను ఇలాగే చూస్తారు - UP పోలీసులు” అని రాశారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌కు చెందినది. ఈ సంఘటన పాకిస్తాన్ అనుకూల నినాదాలకు సంబంధించినది కాదు.

కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మే 27న టైమ్స్ నౌ ఫేస్‌బుక్‌లో ప్రచురించిన వీడియో మాకు చూపించింది. క్యాప్షన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి హైవేలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఒక పోలీసు అధికారి రోడ్డు పక్కన ముగ్గురు వ్యక్తులు విక్టర్, బాబులాల్, రాకేష్‌లను దారుణంగా కొట్టారు. ఆ అధికారి కర్రతో వారి పాదాలను కొట్టడం చూడొచ్చు.

ఈ ముగ్గురూ డ్రగ్స్ మత్తులో ఒక కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది, ఈ ఫుటేజ్ వైరల్ కావడంతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు.

మే 27న ఇండియా టుడే ప్రచురించిన నివేదికలో ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ ను కూడా మేము చూశాము. ‘Video shows Andhra cops beating men in public, Jagan’s party blames TDP rule.’ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.

ఈ కేసు దేని గురించి?

నివేదిక ప్రకారం, తనపై దాడి చేశారని ఆరోపించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఈ ముగ్గురూ గంజాయి మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారత శిక్షాస్మృతిలోని కఠినమైన నిబంధనల కింద హత్యాయత్నం, నేరపూరిత కుట్ర అభియోగాలతో వారిపై కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు వారిని కొట్టారని నివేదికలో ప్రస్తావించలేదు.

టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్ 18, ఆంధ్రజ్యోతి కూడా ఈ సంఘటనను నివేదించాయి. ఈ నివేదికలలో ఏదీ పాకిస్తాన్ అనుకూల నినాదాలతో సంబంధం ఉన్నట్లుగా ప్రస్తావించలేదు.

కాబట్టి, ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినది కాదని, పాకిస్తాన్ అనుకూల నినాదాలతో సంబంధం లేదని మేము నిర్ధారించాము.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Next Story