FactCheck : కంగనా రనౌత్ 'పద్మశ్రీని' వెనక్కు తీసుకోమని ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ కోరారా..?
Did President Kovind Request Modi to RevokeKangana Ranauts Padma Shri Heres the Truth. భారత రాష్ట్రపతి చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
భారత రాష్ట్రపతి చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి కంగనా రనౌత్ పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆ ట్వీట్లో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
1947లో బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడం "భిక్ష" అని రనౌత్ ఇటీవల టైమ్స్ నౌ షోలో చెప్పిన తర్వాత ఇది జరిగింది.
ఆ ట్వీట్ను అనువదించినప్పుడు.. "కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆమెకు పద్మ అవార్డు ఇచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను! అవార్డును ఉపసంహరించుకోవడానికి నన్ను అనుమతించాలని శ్రీ @narendramodiని అభ్యర్థిస్తున్నాను." అని ఉంది.
నిజమెంత :
వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఎటువంటి నిజం లేదు.
స్క్రీన్ షాట్ లో ఉన్న @rashtrptibhvn ట్విట్టర్ పేజీని ఓపెన్ చేయగా.. ఆ అకౌంట్ ను సస్పెండ్ చేశారని తెలుస్తోంది.
President ను కూడా తప్పుగా 'Prasident' అని ట్విట్టర్ ఖాతాలో ఉండడం చూడొచ్చు.. అసలు వెరిఫికేషన్ మార్క్ అన్నది లేదు. వెరిఫై అయినట్లు కూడా కనిపించలేదు.
భారత ప్రెసిడెంట్ ట్విట్టర్ ఖాతా @rashtrapatibhvn లొకేషన్ లో New Delhi అని ఉంది. ట్విట్టర్ లో జాయిన్ అయిన డేట్ July 2017 అని తెలుసుకోవచ్చు. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లోని ట్విట్టర్ ఖాతా @rashtrptibhvn లొకేషన్ United States of America అని ఉంది.. జాయిన్ అయిన డేట్ November 2020 అని ఉంది. కాబట్టి ఇటీవల కొందరు కావాలనే ఈ ఫేక్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక రామ్ నాథ్ కోవింద్ అధికారిక ఖాతాను ఓపెన్ చేసి చూడగా.. కంగనా పద్మశ్రీని వెనక్కు తీసుకోవాలని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి వైరల్ స్క్రీన్ షాట్ లో ఎటువంటి నిజం లేదు.
Claim Review:కంగనా రనౌత్ 'పద్మశ్రీని' వెనక్కు తీసుకోమని ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ కోరారా..?