FactCheck : దోపిడీలకు పాల్పడ్డారని భీమ్ ఆర్మీ కార్యకర్తలను అరెస్ట్ చేశారా?
ఏప్రిల్ 13న హత్యకు గురైన దేవి శంకర్ కుటుంబాన్ని కలవడానికి ఇసౌతా గ్రామాన్ని సందర్శించకుండా జూన్ 29న, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, నాగినా ఎంపీ చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు
ఏప్రిల్ 13న హత్యకు గురైన దేవి శంకర్ కుటుంబాన్ని కలవడానికి ఇసౌతా గ్రామాన్ని సందర్శించకుండా జూన్ 29న, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, నాగినా ఎంపీ చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నిర్బంధం తర్వాత ప్రయాగ్రాజ్లోని కర్చానా ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో ఆజాద్ సమాజ్ పార్టీ, భీమ్ ఆర్మీ మద్దతుదారులు పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు పోలీసులు 65 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో అశాంతిని ప్రేరేపించారని పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఒక వీడియోలో ఇద్దరు వ్యక్తులు పోలీసు కస్టడీలో కుంటుతున్నట్లు చూపిస్తుంది. వారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన హింసలో పాల్గొన్న చంద్రశేఖర్ మద్దతుదారులని పేర్కొంటూ పోలీసులు వారికి 'తగిన శిక్ష' ఇచ్చినందున వారు కుంటుతున్నారని ఈ వీడియో షేర్ చేస్తున్నారు.
మేఘ్ అప్డేట్స్ పేజీలో "ప్రయాగ్రాజ్లో అల్లర్లు చేసిన చంద్రశేఖర్ రావణ్ మద్దతుదారులకు యోగి యుపి పోలీసుల నుండి సరైన చికిత్స లభిస్తోంది" అనే శీర్షికతో వీడియోను షేర్ చేశారు.
బిజెపి నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “ప్రయాగ్రాజ్లో అల్లర్లను రెచ్చగొట్టిన చంద్రశేఖర్ రావణ మద్దతుదారులు యోగిజీ పోలీసుల నుండి సరైన ట్రీట్మెంట్ ను పొందుతున్నారు” అని రాశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
జూన్లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఈ వీడియో చూపిస్తూ ఉంది. వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని న్యూస్మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూన్ 5-6 తేదీలలో అనేక సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసిన అదే ఫుటేజీకి దారితీసింది, రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో నలుగురు దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొంది.
జర్నలిస్ట్ శంకర్ బన్సారీ జూన్ 5న X , ఫేస్బుక్లో వీడియోను పోస్ట్ చేసి, శ్రీ గంగానగర్లో దోపిడీ ముఠాను పట్టుకున్నారని పేర్కొన్నారు.
పోస్ట్ ప్రకారం, గ్యాంగ్స్టర్ల పేరుతో ఒక వ్యాపారవేత్త నుండి రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వేగంగా స్పందించి లగ్జరీ ఫార్చ్యూనర్ వాహనంలో వచ్చిన నలుగురు నేరస్థులను అరెస్టు చేశారు. దర్యాప్తులో వ్యాపారవేత్త అకౌంటెంట్, మేనల్లుడు కూడా కుట్రలో పాల్గొన్నారని తేలింది. పోలీసులు దోపిడీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులను గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
🔴 श्रीगंगानगर ब्रेकिंग न्यूज़ 🔴
— Shankar Bansari Journalist (@shankarban15022) June 5, 2025
रंगे हाथों पकड़ी गई रंगदारी गैंग, 4 बदमाश गिरफ्तार!
🚨 गैंगस्टरों के नाम पर व्यापारी से माँगे थे ₹5 लाख
🚓 लग्जरी फॉर्च्यूनर में आए बदमाशों को पुलिस ने किया दबोच#RangdariGang #SriganganagarPolice #BreakingNews #GangstersCaught #DIGGauravYadav pic.twitter.com/nqgzJs0C0Z
జూన్ 5న, గంగానగర్ పోలీసుల అధికారిక X హ్యాండిల్ వార్తాపత్రిక క్లిప్పింగ్ను షేర్ చేసింది. నివేదిక ప్రకారం, శ్రీ గంగానగర్లోని ఒక వ్యాపారవేత్తను గ్యాంగ్స్టర్ల పేరుతో బెదిరించి రూ. 5 లక్షలు వసూలు చేశారు. పోలీసులు వేగంగా స్పందించి వ్యాపారవేత్త అకౌంటెంట్, మేనల్లుడు సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు లగ్జరీ కారులో వచ్చి డబ్బు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్లను ఉపయోగించి అకౌంటెంట్ ఈ పథకాన్ని అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ ఫలితంగా దోచుకున్న మొత్తాన్ని తిరిగి బాధితులకు ఇచ్చేసారు.
— Ganganagar Police (@sgnrpolice) June 5, 2025
అదే రోజు గంగానగర్ పోలీసులు, ఈ సంఘటనను నివేదించిన ఇతర వార్తాపత్రికల నివేదికలను కూడా పంచుకున్నారు.
కాబట్టి, ఆ వీడియో పాతదని, నాగినా ఎంపీ చంద్రశేఖర్, అతని మద్దతుదారులకు తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam