'ఢిల్లీ ఫైల్స్' సినిమా తీస్తానని అంటున్న 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు

Vivek Agnihotri says 'time to work on The Delhi Files'. వివేక్ అగ్నిహోత్రి తీసిన 'ది కశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది.

By Medi Samrat  Published on  15 April 2022 11:54 AM GMT
ఢిల్లీ ఫైల్స్ సినిమా తీస్తానని అంటున్న కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు

వివేక్ అగ్నిహోత్రి తీసిన 'ది కశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి నటించిన ఈ సినిమాలో కశ్మీర్ లో పండిట్స్ పై జరిగిన మారణహోమాన్ని చూపించింది. ఇప్పుడు, దర్శకుడు వివేక్ తన తదుపరి చిత్రం 'ది ఢిల్లీ ఫైల్స్' చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఏప్రిల్ 15న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, దర్శకుడు తన తదుపరి చిత్రం ది ఢిల్లీ ఫైల్స్‌ని ప్రకటించారు. "I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it's important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus. It's time for me to work on a new film. #TheDelhiFiles (sic)." అంటూ పోస్టు పెట్టారు. "#TheKashmirFiles కి మద్దతు ఇచ్చిన వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా, మేము చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో చాలా కష్టపడ్డాము. నేను మీ టైమ్ లైన్స్ ని స్పామ్ చేసి ఉండవచ్చు, కానీ కశ్మీరీ హిందువులకు జరిగిన మారణహోమం, అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యం" అని అగ్నిహోత్రి తెలిపారు.

కశ్మీర్ ఫైల్స్ 1990లో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ పండిట్‌లు ఎదుర్కొన్న దురాగతాల గురించి చెబుతుంది. చిత్ర తారాగణంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ఉన్నారు. కశ్మీరీ పండిట్ల బాధలు హృదయాన్ని కదిలించాయి.













Next Story