దాదాపు 4 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం గురువారం విడుదలైంది, ఈ సినిమా చూడటానికి బెంగళూరు నుండి అనేక మంది అభిమానులు తమిళనాడులోని హోసూర్కు చేరుకున్నారు. తమిళనాడులో హాసన్ లో సినిమా హాళ్ల ప్రాంగణంలో పటాకులు పేల్చి, కేకులు కట్ చేసి, పాటలకు నృత్యం చేశారు. కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడంతో తమిళనాడు-కర్ణాటక బోర్డర్ లోని టౌన్లలో చూడడానికి అభిమానులు క్యూ కట్టారు.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని ఇటీవల కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కర్ణాటక నాయకులు, రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆయన తన ప్రకటనను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే అందుకు కమల్ హాసన్ ఒప్పుకోలేదు. తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని చెప్పారు.