రూ. 25 కోట్ల అప్పుపై స్పందించిన సమంత

Samantha quashes reports of taking Rs 25 crore financial help for Myositis treatment from an actor. మయోసైటిస్ చికిత్స కోసం సమంత రూత్ ప్రభు 25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం

By Medi Samrat  Published on  5 Aug 2023 11:51 AM GMT
రూ. 25 కోట్ల అప్పుపై స్పందించిన సమంత

మయోసైటిస్ చికిత్స కోసం సమంత రూత్ ప్రభు 25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సమంతకు 2022లో ఆటో-ఇమ్యూన్ కండిషన్ 'మయోసిటిస్' ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె అక్టోబర్ 29, 2022న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన చిత్రాన్ని పంచుకోవడం ద్వారా ఈ వ్యాధి గురించి విషయాన్ని ప్రకటించింది. ఆమె అనారోగ్యం నుండి కోలుకునే సమయంలో సోషల్ మీడియా నుండి విరామం కూడా తీసుకుంది.



ఈ మధ్య ఆమె తన వైద్యం కోసం 25 కోట్ల రూపాయలను టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో నుండి తీసుకుందని వార్తలు రాగా.. వాటిలో ఎటువంటి నిజం లేదని సమంత ఖండించింది. మయోసైటిస్‌ చికిత్సకు 25 కోట్లు అవసరం లేదని తెలిపింది. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. మీరు చెప్పిన దాంట్లో అతి చిన్న మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నానని తెలిపింది. నా కెరీర్‌లో ఇప్పటివరకూ పని చేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదని.. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలనని చెప్పుకొచ్చింది. మయోసైటిస్‌ కారణంగా వేలాది మంది బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి బాధ్యత వహించండని సమంత చెప్పుకొచ్చింది. సమంత చివరిగా 'శాకుంతలం'లో కనిపించింది. ఇది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. ఆమె వరుణ్ ధావన్‌తో కలసి యాక్షన్-థ్రిల్లర్ ‘సిటాడెల్ ఇండియా’ లో కనిపించనుంది. విజయ్ దేవరకొండ సరసన ప్రేమకథ ‘కుషి’లో నటిస్తోంది.

Next Story