త‌ల్లి పుట్టిన‌రోజున మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ ప‌వ‌న్..!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.

By -  Medi Samrat
Published on : 29 Jan 2026 3:04 PM IST

త‌ల్లి పుట్టిన‌రోజున మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ ప‌వ‌న్..!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. ఆయ‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు పేర్కొన్నారు. జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు. జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. ఆపై కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్ని ప్రారంభించారు. ఆపై ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Next Story