స్టేజి మీదే కుప్పకూలిపోయిన సింగ‌ర్‌

Odia singer Murali Mohapatra collapses and dies while performing on stage. ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మహపాత్ర కన్నుమూశారు.

By Medi Samrat  Published on  4 Oct 2022 3:30 AM GMT
స్టేజి మీదే కుప్పకూలిపోయిన సింగ‌ర్‌

ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మహపాత్ర కన్నుమూశారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గా పూజ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా కుప్పకూలి మరణించారు. జెయోర్ పట్టణంలో కార్యక్రమంలో నాలుగు పాటలు పాడిన తర్వాత అకస్మాత్తుగా వేదికపై కుర్చీపై కూర్చున్నారు. అస్వస్థతకు గురైన మోహపాత్ర అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మహపాత్ర మీడియాకు తెలిపారు.

జైపూర్ పట్టణంలోని రాజనహర్ పూజా మండపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో మోహపాత్ర ప్రదర్శన ఇస్తుండగా వేదికపై కుప్పకూలిపోయారు. వేదికపై కుర్చీపై కూర్చుని ఇతర గాయకుల పాటలు వింటున్న సమయంలో ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయారని కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు తెలిపారు. మురళి మృతి వార్త తెలియగానే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆయన్ను జైపూర్‌కి చెందిన అక్షయ మొహంతి అని కూడా పిలుస్తారు. మురళి పాటలు పాడడానికి ముందు జైపూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేశారు. మహపాత్ర మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. "ప్రముఖ గాయకుడు మురళీ మహపాత్ర మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన మధురమైన గాత్రం శ్రోతల హృదయాలను ఎప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని ట్విట్టర్ పోస్ట్‌లో పట్నాయక్ పేర్కొన్నారు.


Next Story