అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతానన్న నటి నోరా ఫతేహి

Nora Fatehi to be ED witness in Rs 200-crore extortion case. మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌పై విచారణలో

By Medi Samrat  Published on  22 Dec 2021 9:40 AM GMT
అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతానన్న నటి నోరా ఫతేహి

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌పై విచారణలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఉంటారని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ కు చెందిన నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమ స్కానర్‌లో ఉంచింది. ఇందులో సుకేష్ చంద్రశేఖర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. వీరు ఆర్థిక దర్యాప్తు సంస్థల ముందు చాలాసార్లు విచారణకు హాజరయ్యారు.

నోరా ఫతేహికి సుకేష్ చంద్రశేఖర్ బిఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ అనుమానిస్తోంది. చంద్రశేఖర్ తనకు కారు ఇచ్చాడని, అతని భార్య లీనా మారియా పాల్ కూడా తనకు గూచీ బ్యాగ్, ఐఫోన్‌ను ఇచ్చిందని ఆమె తర్వాత వెల్లడించింది. అక్టోబర్ 14న నోరా ఫతేహి సుకేష్‌ తో మాట్లాడింది. ఈ సమయంలో గిఫ్ట్ పార్ట్ గురించి చర్చించారు. లీనా మారియా పాల్ తనను ఒక ఈవెంట్ కోసం ఆహ్వానించినట్లు నోరా ఫతేహి ఈడీకి చెప్పింది. ఈ సంఘటన డిసెంబర్ 2020 లో చెన్నైలో జరిగింది.

నోరా ఫతేహి అక్టోబర్ 14న ఒక ప్రకటన విడుదల చేసింది, తాను ఎలాంటి మనీలాండరింగ్ కార్యకలాపాల్లో భాగం కాలేదని స్పష్టం చేసింది. "నోరా ఫతేహి కేసులో సాక్షిగా మారింది. ఆమె దర్యాప్తులో అధికారులకు సహకరిస్తోంది అలాగే సహాయం చేస్తోంది. ఆమె ఎలాంటి మనీలాండరింగ్ కార్యకలాపాల్లో భాగం కాలేదని, నిందితుడితో ఆమెకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని, దర్యాప్తులో ఖచ్చితంగా సహాయం చేయడానికి ఆమె నిర్ణయించుకుందని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము, "అని నోరా ఫతేహి తరపున ఒక ప్రకటన జారీ చేయబడింది.


Next Story