ద‌గ్గుబాటి మ‌ల్టీస్టార‌ర్ మూవీ

Daggubati Multi Starrer Movie May Start Soon. అక్కినేని వారి కుటుంబంలోని హీరోలంతా క‌లిసి నటించిన చిత్రం 'మ‌నం'

By Medi Samrat  Published on  29 Dec 2020 5:12 AM GMT
ద‌గ్గుబాటి మ‌ల్టీస్టార‌ర్ మూవీ

అక్కినేని వారి కుటుంబంలోని హీరోలంతా క‌లిసి నటించిన చిత్రం 'మ‌నం'. విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున, నాగ చైత‌న్య‌, అఖిల్‌, స‌మంత న‌టించారు. చ‌క్క‌ని క‌థ‌తో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఇక త‌న కుటుంబంలోని క‌థానాయ‌కులు అంద‌రినీ క‌లిసి ఓ సినిమా నిర్మించాల‌నేది డి.రామానాయుడు క‌ల‌. అయితే.. స‌రైన క‌థ ల‌భించ‌క అది ఆయ‌న జీవించి ఉండ‌గా.. కార్య‌రూపం దాల్చ‌లేదు. ఆయన మరణాంతరం అతడి తనయుడు డీ సురేష్ బాబు వెంకటేష్-నాగచైతన్య కాంబోలో 'వెంకీమామ' అంటూ సూపర్ హిట్ అందుకున్నారు

అయితే.. ఆయ‌న కుటుంబంలోని హీరోలంతా క‌లిసి ఓ చిత్రం రాలేదు. తాజాగా.. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న స‌తీష్ వేగ‌ష్న ద‌గ్గుబాటి ఫ్యామిలీ కోసం ప్ర‌త్యేక క‌థ సిద్దం చేశార‌ట‌. త్వ‌ర‌లో ఈ క‌థ‌ని ఆ హీరోల‌కి వినిపించి వీలైనంత త్వ‌ర‌గా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ సినిమా క‌థ న‌చ్చి వెంక‌టేష్‌, రానా, నాగ చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే ద‌గ్గుబాటి అభిమానుల ఆనందం అవ‌ధులు దాట‌డం ఖాయం అని చెబుతున్నారు. ప్ర‌స్తుతం స‌తీష్ వేగేష్న కోతి కొమ్మ‌చ్చి అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయ్యాక ద‌గ్గుబాటి ఫ్యామిలి చిత్రంపై పుల్ ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు.


Next Story