'చంటి' సినిమా ముందుగా ఆ హీరోతో చేయాలనుకున్నారట.. కానీ!

Chanti Movie News. వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లగా దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన " చంటి" సినిమా ముందుగా ఆ హీరోతో చేయాలనుకున్నారట.. కానీ.

By Medi Samrat  Published on  11 Jan 2021 8:21 AM GMT
Chanti Movie
వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లగా దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన" చంటి"ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఒక పల్లెటూరులో నివసించేటటువంటి అమాయకుడి పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు. ఇంత విజయవంతమైన సినిమాను ముందుగా దర్శకుడు వెంకటేష్ ను కాకుండా మరో హీరోతో తీయాలని భావించారట.

ముందుగా చంటి సినిమాలో నటించడానికి వెంకటేష్ కి బదులు రాజేంద్ర ప్రసాద్ అని భావించారు. కానీఈ సినిమాను వెంకటేష్ తో తీయడానికి గల కారణాలను దర్శకుడు రవి రాజా పినిశెట్టి ఓ సందర్భంలో తెలియజేశాడు. ఇంత అద్భుతమైన సినిమా 1992 జనవరి 10వ తేదీన విడుదల అయి ఎంతో విజయాన్ని సాధించింది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన 'చినతంబి'సినిమాని తెలుగులో చంటి గా తెరకెక్కింది.

యార్లగడ్డ సురేందర్‌ నిర్మాతగా వెంకటేశ్‌తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాం. ఆ సమయంలో రామానాయుడు తమిళంలో తెరకెక్కిన చిన్న తంబి చిత్రాన్ని చూసి ఆ కథ వెంకటేష్ కు సరిపోదని భావించారు. అదే సమయంలో కె ఎస్ రామారావు గారు కూడా ఆ సినిమాను చూసి ఆ పాత్రలో నటించడానికి రాజేంద్రప్రసాద్ సరిపోతారని భావించారు. దీంతో ఆ విషయాన్ని రాజేంద్రప్రసాద్ కి చెప్పి సినిమాను కూడా ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ తో నాకున్న పరిచయం బట్టి అతను హీరోగా ఈ సినిమాలో నటిస్తే మంచిగా వస్తుందని భావించారు. అయితే ఇదంతా కూడా తమిళంలో చిన్న తంబీ విడుదల కాకముందు జరిగింది.

తరువాత తమిళంలో ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాను సురేష్ బాబు వెంకటేష్ చూశారు. వారికి కూడా ఈ సినిమా నచ్చింది. దీంతో కె.ఎస్.రామారావు నా దగ్గరకు వచ్చి వెంకటేష్ హీరోగా ఈ సినిమాను తీద్దామని తెలిపాడు. అయితే అప్పటికే రాజేంద్ర ప్రసాద్ కి మాట ఇచ్చి ఉండడంతో అందుకు నేను ఒప్పుకోలేదు అని తెలియజేశారు. అవసరమైతే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి భావించారట. అయితే ఆ సమయంలో చిరంజీవి గారు నాకు నచ్చజెప్పడంతో ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాను. అయితే అదే సమయంలో ఖుష్బూ వెంకటేష్ సరసన నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రలో మీనాను తీసుకొని చిత్రాన్ని నిర్మించినట్లు దర్శకుడు రవిరాజా పినిశెట్టి తెలియజేశారు.


Next Story