వివాదంలో 'పుష్ప' ఐటమ్ సాంగ్.. సమంతపై పురుష సంఘాల కేసు నమోదు

Case filed against samantha special song . గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ అవుతుందనుకునే లోపే 'పుష్ప' సినిమాపై వివాదం తలెత్తింది. అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమా విడుదలకు

By అంజి  Published on  13 Dec 2021 12:57 PM GMT
వివాదంలో పుష్ప ఐటమ్ సాంగ్.. సమంతపై పురుష సంఘాల కేసు నమోదు

గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ అవుతుందనుకునే లోపే 'పుష్ప' సినిమాపై వివాదం తలెత్తింది. అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమా విడుదలకు సంబంధించి జోరుగా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కూడా ఎంతో గ్రాండ్‌గా జరిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్‌, దేవీ శ్రీ ప్రసాద్‌ మినహా అందరూ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్‌లో మెరిసింది. సమంత డ్యాన్స్‌ చేసిన ఈ ఐటెం సాంగ్‌పై వివాదం చెలరేగుతోంది. 'పుష్ప' సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

సమంత తన కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ చేసిన ఐటం సాంగ్‌ ఇదే. ఉ అంటావా మావ.. ఊఊ అంటావా అంటూ సాగే పాటకు సమంత స్పెషల్‌ డ్యాన్స్‌ చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. ఇక ఈ పాటలో సమంత సైతం తన అందచందాలను ఆరబోసింది. అయితే ఆ పాటపై ఇప్పుడు పురుషుల సంఘం కేసుపెట్టింది. పురుషులను కామాంధులుగా చూపించే ప్రయత్నం ఈ పాటలో చేసారని వాళ్లు ఆరోపించిరాని తెలుస్తుంది. పాటలోని సాహిత్యం, విజువల్స్ పురుషులను వంకర బుద్ధితో చూపించే ప్రయత్నం చేశారని, అందుకే ఈ స్పెషల్‌ సాంగ్‌పై దావా వేయబడింది.

ఈ పాటపై నిషేధం విధించాలంటూ పురుషుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇంకా కేసు పరిష్కారం కాలేదు. సమంత రూత్ ప్రభుపై కూడా పురుష సంఘం కేసు పెట్టారు. ఒక ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చేశారు. మీ మగబుద్దే పాడు బుద్దీ అంటూ సాగే ఈ పాటపై ఇప్పుడు పురుష సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story