విద్యార్థులకు బిగ్ అలర్ట్..గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది

By Knakam Karthik
Published on : 30 May 2025 12:59 AM

Education News, Telangana, Scholarships, Students,

విద్యార్థులకు బిగ్ అలర్ట్..గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించింది. స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం రాష్ట్రంలోని కళాశాలలు, విద్యార్థుల ఇ-పాస్‌ వెబ్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30 వరకు పొడిగించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల పథకం కింద రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన తరగతి , మైనారిటీలు, శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే స్కాలర్‌షిప్‌లను అందిస్తుందని తెలిపారు.

పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల మంజూరు, పంపిణీలో మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి, వెబ్‌సైట్‌:ttp://telanganaepass.cgg.gov.in (E-PASS PORTAL) అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కింద తాజా పునరుద్ధరణ స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం డేటాను ప్రారంభించడానికి, ప్రాసెస్‌ చేయడానికి ఈ వ్యవస్థకు కళాశాలలు, విద్యార్థుల నమోదు అవసరమని తెలిపారు.

Next Story