క‌దులుతున్న‌ రైలు నుండి యువకుడిని నెట్టేసిన పోలీసులు

Youth allegedly pushed from running train by Government Reserve Police. గవర్నమెంట్ రిజర్వ్ పోలీస్ (GRP) అధికారులు 35 ఏళ్ల వ్యక్తిని కదులుతున్న రైలు నుండి తోసారు.

By Medi Samrat  Published on  23 Oct 2022 1:02 PM GMT
క‌దులుతున్న‌ రైలు నుండి యువకుడిని నెట్టేసిన పోలీసులు

గవర్నమెంట్ రిజర్వ్ పోలీస్ (GRP) అధికారులు 35 ఏళ్ల వ్యక్తిని కదులుతున్న రైలు నుండి తోసారు. ఈ సంఘటన గురువారం రాత్రి 12322 (ముంబయి నుండి హౌరా) ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. ఉంచ్‌డిహ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని అరుణ్ భుయాన్‌గా గుర్తించామని, ఈ విషయమై అరుణ్ స్నేహితుడు అర్జున్ భుయాన్ ఫిర్యాదు చేశాడు.

అర్జున్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. అతను అరుణ్‌తో సహా అతని స్నేహితులు ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. రైలు చోక్సీ రైల్వే స్టేషన్‌ను దాటిన వెంటనే GRP సిబ్బంది ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అరుణ్‌, జీఆర్‌పీ సిబ్బంది మధ్య ఏదో గొడవ జరిగింది. ఇది చివరికి ఇద్దరు GRP వ్యక్తులు అరుణ్‌ను కదులుతున్న రైలు నుండి బయటకు నెట్టడానికి దారితీసింది. ఇది అతని మరణానికి దారితీసింది.

అర్జున్ ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు GRP సిబ్బందిపై శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు నిందితులను జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కుమార్ సిం, కానిస్టేబుల్ అలోక్ కుమార్ పాండేగా గుర్తించారు. ఇద్దరిపై భారతీయ శిక్షాస్మృతి లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరుణ్, జీఆర్‌పీ సిబ్బంది మధ్య వాగ్వాదానికి దారి తీసిన విషయం.. అరుణ్ సరైన టిక్కెట్‌తో ప్రయాణిస్తున్నారా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story