గోనె సంచిలో మహిళ సగం కాలిన మృతదేహం

Woman's half-burnt body recovered from sack in Kaushambi. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సగం కాలిన మహిళ మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది.

By Medi Samrat  Published on  8 Jan 2023 2:45 PM GMT
గోనె సంచిలో మహిళ సగం కాలిన మృతదేహం

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సగం కాలిన మహిళ మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది. శనివారం జిల్లాలోని బదన్‌పూర్ గ్రామంలో మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఓ గోనె సంచిలో నుండి దుర్వాసన వస్తుండడాన్ని.. స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గోనె సంచిలో సగం కాలిన మహిళ మృతదేహం కనిపించింది. మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. హత్యకు గల కారణాలను తెలుసుకుని నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

ఈ నెల ప్రారంభంలో, మహారాష్ట్రలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. పూణేకు చెందిన న్యాయవాదికి సంబంధించిన సగం కాలిన మృతదేహం మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో కనుగొనబడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మృతుడు శివశంకర్ షిండేగా గుర్తించారు. పూణే నుంచి అదృశ్యమైన రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. షిండే చివరిసారిగా డిసెంబర్ 31 మధ్యాహ్నం తన కార్యాలయంలో కనిపించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు జనవరి 1 తెల్లవారుజామున పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా డెగ్లూర్ సమీపంలో అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


Next Story