స్టేషన్‌కు వెళ్లిన యామిని తిరిగొచ్చి.. ఊహించని నిర్ణయం

స్నేహితురాళ్లతో కలిసి గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

By Medi Samrat
Published on : 24 July 2025 10:30 AM IST

స్టేషన్‌కు వెళ్లిన యామిని తిరిగొచ్చి.. ఊహించని నిర్ణయం

స్నేహితురాళ్లతో కలిసి గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తున్న చింతల యామిని రూమ్లో ఎవరు లేని సమయంలో కిటికీ గ్రిల్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం పట్టణం గాంధీనగర్కు చెందిన చింతల యామిని గచ్చిబౌలి ఇందిరానగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటూ ఐటీ జాబ్ చేస్తోంది. ఊరెళ్లేందుకు కాచిగూడ స్టేషన్కు వెళ్లిన ఆమెకు వాంతులు అవ్వడంతో తిరిగి హాస్టల్కు వెళ్లింది. అయితే చున్నీతో గ్రిల్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆఫీస్కి వెళ్ళిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి వచ్చి చూడగా కిటికీ గ్రిల్కు ఉరివేసుకొని ఉన్న స్థితిలో యామిని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యామిని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story