నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లికొడుకుతో చెప్పిందని తెలుసుకున్న తండ్రి, సోదరుడు.. ఆ తర్వాత

Woman Killed By Family Over Love Affair. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 22 ఏళ్ల వైద్య విద్యార్థినిని ఆమె తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు

By M.S.R  Published on  27 Jan 2023 11:18 AM GMT
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లికొడుకుతో చెప్పిందని తెలుసుకున్న తండ్రి, సోదరుడు.. ఆ తర్వాత

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 22 ఏళ్ల వైద్య విద్యార్థినిని ఆమె తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు మగ బంధువులు కలిసి హత్య చేశారు. ఆమె ప్రేమ వ్యవహారం తెలియడంతో గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తగులబెట్టారని ఒక అధికారి తెలిపారు. ముంబైకి 600 కిలోమీటర్ల దూరంలోని లింబ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామంలో జనవరి 22న ఈ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. మహిళను ఆమె కుటుంబ సభ్యులు తాడుతో గొంతు బిగించి హత్య చేశారని, ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నిప్పంటించి ఆమె అవశేషాలను ఓ నీటి ప్రవాహంలో విసిరారని పోలీసులు అధికారులు తెలిపారు.

బాధితురాలు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) మూడో సంవత్సరం విద్యార్థినికి ఆమె వివాహం నిశ్చయమైంది. అయితే, ఆమె తన గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు పెళ్లి కొడుకుకు తెలియజేసింది. దీంతో ఆ వ్యక్తి పెళ్లి వద్దనుకున్నాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసి పరువు తీసేసిందనే కోపంతో ఈ దారుణానికి తెగబడ్డారు. యువతి తండ్రి, సోదరుడు, మేనమామ, బంధువులు జనవరి 22 రాత్రి ఆమెను పొలానికి తీసుకెళ్లారు. వారు ఆమెను హత్య చేసి, సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.




Next Story