ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భోజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్పూర్ గ్రామంలో తన ప్రేమికుడిని కలవడానికి నిరాకరించినందుకు భార్య తన భర్తను చంపి, అతని మృతదేహాన్ని బ్లూ డ్రమ్లో వేస్తానని బెదిరించింది. బెదిరింపులతో భర్త భయాందోళనకు గురవుతున్నాడు. ఆయన ఇంటికి వెళ్లడం లేదు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
షకుర్పూర్ గ్రామానికి చెందిన గరీబ్దాస్ కూలీ. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్కు చెందిన మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఓ యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం విషయం తెలియగానే భార్యను అడ్డుకున్నాడు. యువకుడితో సంబంధాలు మానుకోవాలని కోరాడు. కానీ అతని భార్య నిరాకరించింది. ఇప్పుడు కూడా ఆమె యువకుడితో మాట్లాడుతుంది.
కొన్ని రోజుల తర్వాత తనను కలవమని గరీబ్దాస్ భార్యను ఆ యువకుడు మళ్లీ అడగడంతో ఆమెను అడ్డుకున్నాడు భర్త. దీనిపై ఆమె కోపంగా ఉంది. తనను కలవకుండా అడ్డుకుంటే ప్రేమికుడితో కలిసి నిన్ను చంపేస్తానని, నీలిరంగు డ్రమ్ములో మృతదేహాన్ని నింపుతానని బెదిరించింది. అప్పటి నుంచి గరీబ్దాస్ తీవ్ర భయాందోళనలో ఉన్నాడు. తన భార్య తనను చంపేస్తుందేమోనని భయపడుతున్నాడు. మనస్తాపం చెంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.