భ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భార్య‌

Wife Killed Husband In Bhupalapalli. భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపింది ఓ భార్య‌.

By Medi Samrat  Published on  3 Jun 2021 5:16 AM GMT
భ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భార్య‌

భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపింది ఓ భార్య‌. జిల్లా కేంద్రంలోని మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామ పంచాయతీ శ్రీపాద కాలనీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాత్రి తాగిన మత్తులో భార్య, భర్తల మధ్య ఘర్షణ జ‌రిగింది. తెల్లవారే సరికి భ‌ర్త‌ నలుబోతుల కిష్టయ్య(38) మంచంలో రక్తపు మడుగులో పడి ఉండగా.. గ్రామస్తులు పోలీస్ లకు సమాచారం అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా.. తనపై గొడ్డలితో దాడి చేసేందుకు వచ్చిన‌ భర్త తో పెనుగులాడే క్రమంలో.. ఒకరిపై ఒకరు పడటంతో భర్త గొంతుకు గొడ్డలి గుచ్చుకుని చనిపోయాడాని భార్య చెబుతుంది. అయితే.. ర‌క్ష‌ణ కోసం చేసిందా.. క్షణిక ఆవేశంలో హత్య చేసిందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.


Next Story