మాజీ మంత్రి ఆశ్రమంలో.. కుళ్లిన స్థితిలో దళిత యువతి మృతదేహం లభ్యం

Unnao Dalit woman was strangulated, her neck snapped. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో శుక్రవారం మృతదేహం లభ్యమైన దళిత మహిళ శవపరీక్షలో ఆమె గొంతు నులి

By అంజి  Published on  11 Feb 2022 7:51 AM GMT
మాజీ మంత్రి ఆశ్రమంలో.. కుళ్లిన స్థితిలో దళిత యువతి మృతదేహం లభ్యం

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో శుక్రవారం మృతదేహం లభ్యమైన దళిత మహిళ శవపరీక్షలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆమె మెడ విరిగిందని తేలింది. రెండు నెలల క్రితం డిసెంబర్ 8న అదృశ్యమైన 22 ఏళ్ల యువతి మృతదేహాన్ని శుక్రవారం రాష్ట్ర మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. శవపరీక్ష నివేదిక కూడా ఆమెపై దాడి జరిగిందని, ఆమె తలపై రెండు గాయాలు గమనించినట్లు పేర్కొంది.

మహిళ కనిపించకుండా పోయినా పోలీసులు తన ఫిర్యాదులను పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. "మీ అమ్మాయి ఇంటి నుండి పారిపోయిందని అధికారులు చెప్పారు, ఆమె త్వరలో తిరిగి వస్తుందని, ఎస్పీని కలవడానికి కూడా అధికారులు అనుమతించలేదు." విచారణలో అలసత్వం వహించినందుకు ఆ ప్రాంతానికి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై ఎస్పీ మాజీ మంత్రి దివంగత ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను జనవరి 24న అరెస్టు చేశారు.

జనవరి 25న, లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వాహనం ముందు మహిళ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు, ముఖ్యంగా స్థానిక ఎస్‌హెచ్‌ఓ అఖిలేష్ చంద్ర పాండే నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహిళ తల్లి ఆరోపించింది. ఉన్నావ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ మాట్లాడుతూ.. "డిసెంబర్ 8 న, తప్పిపోయిన ఫిర్యాదు దాఖలైంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం జనవరి 10 న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణలో లభించిన వివరాల ఆధారంగా మృతదేహాన్ని వెలికితీశారు. మేము పోస్ట్‌మార్టం చేస్తున్నాము. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాము. అన్నారు.

పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని కుటుంబీకుల ఆరోపణ గురించి అడిగినప్పుడు.. ఏఎస్పీ మాట్లాడుతూ.. "ఇది పూర్తిగా నిజం కాదు. మొదట, మహిళ మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. నిందితులు మహిళకు హాని చేసి ఉంటారని దర్యాప్తు అధికారి అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులు తదనుగుణంగా వ్యవహరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేశారు. మేము అతని సహచరుల కోసం వెతుకుతున్నామని'' అన్నారు.

ఇంతలో మహిళ తల్లి విలేకరులతో మాట్లాడుతూ.. "నా కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి అక్కడ పాతిపెట్టాడు. నేను ఇంతకు ముందు ఆశ్రమానికి వెళ్ళాను. వాళ్ళు మాకు మూడంతస్తుల బిల్డింగ్ తప్ప మొత్తం ప్రాంగణాన్ని చూపించారు. నేను స్థానిక పోలీసు అధికారికి కాల్ చేసాను, కానీ అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతను వచ్చి ఉంటే, నా కుమార్తె సజీవంగా దొరికేది. రాజోల్ సింగ్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ గురువారం రాత్రి ఒక వీడియో సందేశాన్ని ఉంచారు.

Next Story