ఖాళీ ఇంటికి తీసుకెళ్లి.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్

Two minor boys in Delhi arrested for raping minor girl. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మైనర్ అబ్బాయిలను అరెస్టు చేశారు.

By అంజి  Published on  26 Jan 2022 6:07 AM GMT
ఖాళీ ఇంటికి తీసుకెళ్లి.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మైనర్ అబ్బాయిలను అరెస్టు చేశారు. సోమవారం నాడు ఈ ఘటన జరిగిందని, బాలిక తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇద్దరు మైనర్ బాలురు ఆమెను సమీపంలోని ఖాళీ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆడుకోవడానికి బయటకు వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు తిరిగి వచ్చింది. తన పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి గురించి తల్లికి చెప్పింది. తల్లి మరింత సమాచారం అడగడంతో జరిగిన విషయాన్ని మైనర్ బాలిక వెల్లడించింది.

తల్లి ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. బాధితురాలికి కౌన్సెలింగ్ చేసేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులను పిలిచారు. ఆమెను వైద్య పరీక్షలకు పంపగా లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించారు. తల్లి ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం శాస్త్రి పార్క్‌లోని వారి ఇళ్ల నుంచి బాలురను పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)కి కూడా నివేదించింది.

డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. "ఎనిమిదేళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురైంది. ఆమె ప్రైవేట్ భాగాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె జీవితం కోసం పోరాడుతున్నప్పుడు ఊహించలేనంత నొప్పితో ఉంది. 8 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసిన వ్యక్తులు మనుషులు కాదు. దోషులకు కఠిన శిక్ష విధించాలి.'' అని అన్నారు. శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ మరియు పోక్సో చట్టంలోని సెక్షన్‌లు 363 (కిడ్నాప్‌కు శిక్ష), 376 (ఏబీ) (12 ఏళ్లలోపు వారిపై అత్యాచారం చేసినందుకు శిక్ష) కింద కేసు నమోదైంది.

Next Story